కరోనా అనేక కొత్త విషయాలు నేర్పింది అని సీసీఎం డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలో మెడిసిన్ కోసం ఎక్కువ ప్రయోగాలు జరిగాయని అన్నారు. అనేక కంపెనీలు ఇన్క్యూబేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాయి అని చెప్పారు. అతి తక్కువ సమయంలో సక్సెస్ స్టోరీ రావడం సంతోషకరం అన్నారు. కరోనా వైరస్ కోసం దేశంలో అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి అని చెప్పారు.

క్వాలిటీ ఉత్పత్తులు బయటకు వస్తున్నాయి అని అన్నారు. పుట్టగొడుగులతో యాంటీ వైరల్ ప్రాపర్టీ అభివృద్ధి చేయడం సంతోషకరం అని చెప్పారు. వైరస్ సెల్స్ ను బ్రేక్ చేస్తు.. వైరస్ పెరుగుదలను కమ్యూనిటీ బూస్టర్ నిరోదిస్తోంది అని అన్నారు. అనేక కంపెనీలు వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తున్నాయని పేర్కొన్నారు.  మార్కెట్ లోకి ఫుడ్ సప్లిమెంట్ డ్రగ్ రావడం సంతోషకరమని చెప్పారు. సమాజం  కోసం సీసీఎంబీ కృషి అభినందనీయని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: