ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని తప్పుబడుతూ చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడంపై ఇప్పుడు వైసీపీ సీరియస్ గా ఉంది. తాజాగా విశాఖలో అక్రమ కట్టడాల విషయంలో ఏపీ సర్కార్ దూకుడుగా ఉంటే దాన్ని కూడా తప్పుబడుతూ విమర్శలు చేయడం గమనార్హం.

 దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో తన ట్విట్టర్ ఖాతాలో విమర్శలకు దిగారు. “పాలనాధికారం ఉంటే ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కుతుందని రాజకీయ పార్టీలు భావిస్తాయి. పచ్చ పార్టీ ఫిలాసఫీ మాత్రం దీనికి భిన్నం. దోపిడీలు, ఆక్రమణలు, తవ్వకాలకు  పవర్ తప్పనిసరి అని అనుకుంటుంది. అందుకే అన్నిరకాల మాఫియాలను ప్రోత్సహించింది. పుట్ట పగులుతుంటే తట్టుకోలేక పోతోంది.” అని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: