ఏపీలో ఈ మధ్య కాలంలో కొంత మంది వైసీపీ నేతల వ్యవహారం కాస్త వివాదాస్పదం అవుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన కొన్ని వర్గాలు వ్యక్తం  చేస్తున్నాయి. తాజాగా ఒక ఘటన చోటు చేసుకుంది. వైసిపి వేదింపులకు ఓ ముస్లిం మౌజాం ఆత్మహత్య యత్నం చేసారు. తాడికొండ మండలానికి కు చెందిన షేక్ హనీఫ్ పురుగుల మందు తాగాడు.

ముస్లిం స్మశాన వాటికలో మట్టి తవ్వకాలు చేపట్టిన వైసిపి నేతలను ఆయన అడ్డుకున్నారు. అక్రమ మట్టి తవ్వకాలను ప్రశ్నించిన మౌజాం హనీఫ్... పోలీసులకు ఫిర్యాదు చేస్తా అని హెచ్చరించారు. హనీఫ్ పై వైసిపి నేతలు దాడి చేసారు. మనస్దాపంతో పురుగు మందు తాగిన హనీఫ్ ని స్థానికులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య యత్నం కు ముందు సెల్ఫీ వీడియో చేసి దాన్ని విడుదల చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: