ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ కి వామపక్షాల పర్యటన హాట్ టాపిక్ గా మారింది. వామపక్షాలు ఇప్పుడు ఈ పర్యటన చేయడం  పోలీసులు అడ్డుకోవడం వంటివి జరిగాయి. ఇక పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పుడు వైసీపీ నేతలు కాస్త ఘాటుగానే విపక్షాలకు సమాధానం చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా ఈ అంశం హాట్ టాపిక్ అయింది. ఇక వామపక్షాలు  కొన్ని విధాలుగా రెచ్చగొట్టే ఆరోపణలు చేస్తున్నాయని, ప్రవర్తిస్తున్నాయని ఏపీ సర్కార్ అంటుంది.

తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేసారు. “ఎల్లో మీడియా, ఎర్ర పార్టీని పోలవరం ముట్టడికి పంపించే బదులు మీరే స్వయంగా వెళ్లి రావొచ్చుగా బాబు గారూ. టీవీ చర్చల్లో బిగ్గరగా అరిచే ఉద్ధండ మేధావులను వెంట పెట్టుకుని టేపులతో కొలతలు తీసుకోండి. ఏడాదిలో ప్రాజెక్టు నిర్మాణం ఎలా ఉరుకులు పెట్టిందో జనానికి చూపించినట్టవుతుంది.” అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: