డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా...? కోటీశ్వరులు కావాలని కలలు కంటున్నారా..? కల కంటే సరిపోదు.. దాన్ని సాధ్యం చేసుకోవాలి. అయితే మీకు అందుబాటులో ఒక ఆప్షన్ ఉంది. దీని కోసం ఇన్వెస్ట్ చేయాలి మరి. మార్కెట్‌లో చాలా ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక భాగమే. మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) రూపంలో ప్రతి నెలా డబ్బులు పెడుతూపోతే దీర్ఘకాలంలో అదిరిపోయే రాబడి పొందొచ్చు. అయితే ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్లు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయనే విషయాన్ని మరిచిపోకూడదు.

మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడమే కాకుండా ప్రతి నెలా 10 శాతం స్టెప్ అప్‌ను పెట్టుకుంటే మెచ్యూరిటీ కాలంలో ఇంకా అదిరిపోయే రాబడి పొందొచ్చని ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు పేర్కొంటున్నారు. ట్రాన్సెండ్ కన్సల్టెంట్స్ వెల్త్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ కార్తీక్ ఝవేరి మాట్లాడుతూ.. దీర్ఘకాల అంచనాలతో చూస్తే మ్యూచువల్ ఫండ్స్ కనీసం 12 శాతం రాబడి అందిస్తాయని తెలిపారు. ఒకవేళ ఫండ్స్ మెరుగైన పనితీరు కనబరిస్తే అప్పుడు 15-18 శాతం రాబడి కూడా అంచనా వేయవచ్చని పేర్కొన్నారు. మెచ్యూరిటీ సమయంలో కోటీశ్వరులు కావొచ్చని పేర్కొన్నారు.

15 శాతం వార్షిక రాబడి ప్రాతిపదికన చూస్తే.. రోజుకు రూ.33.33 లేదా నెలకు రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తూ వెలితే దీర్ఘకాలంలో భారీ మొత్తం పొందొచ్చని కార్తీక్ తెలిపారు. 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెలితే (మీకు బిడ్డ పుట్టిన వెంటనే వారి పేరుపై ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించండి) ఎస్‌బీఐ సిప్ క్యాలిక్యులేటర్ ప్రకారం.. మెచ్యూరిటీ సమయంలో రూ.70 లక్షలు పొందొచ్చు. అదే మీరు 10 శాతం స్టెప్ అప్ ఆప్షన్ ఎంచుకుంటే అప్పుడు మీరు పొందే మొత్తం 1.5 కోట్లు అవుతుంది.

గత ఏడాది కాలంలో యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ ఏకంగా 21.5 శాతం రాబడి అందించిందని సెబీ రిజిస్టర్డ్ ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడు జితేంద్ర సోలాంకి తెలిపారు. గత మూడేళ్ల కాలంలో చూస్తే ఈ ఫండ్ దాదాపు 19 శాతం రాబడిని అందించిందని పేర్కొన్నారు. ఇదొక లార్జ్‌క్యాప్ ఫండ్ అని తెలిపారు. 25 నుంచి 30 ఏళ్ల దీర్ఘకాల అంచనాలతో ఇందులో ఇన్వెస్ట్ చేస్తే 15 శాతం రాబడి పొందొచ్చని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: