ఇటీవల కాలంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చాయి. కానీ మహిళల భద్రతకు మాత్రం హామీ లభించట్లేదు. దేశంలో రోజు రోజుకూ మహిళలపై పెరిగిపోతున్న అకృత్యాలు, అత్యాచారాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఆడది కనిపిస్తే చాలు.. కామాంతో మగాళ్లు మృగాళ్లుగా మారి పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. ఇక ఓ యువకుడు మహిళలను టార్గెట్ చేస్తూ.. వాళ్లకు దగ్గరవుతున్నాడు. ఆ తర్వాత వాళ్ల దగ్గర నుంచి నగ్న చిత్రాలు సేకరిస్తాడు. ఇక అక్కడి నుంచి తన విశ్వరూపం చూపిస్తాడు. తన కోరిక తీర్చాలంటూ వారిని వేధిస్తున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వింజమూరుకు చెందిన ప్రశాంత్ ఎమ్మెస్సీ చదివాడు. పరిచయస్తులు, స్నేహితుల ద్వారా విద్యార్థినులు, యువతులు, వివాహితల ఫోన్నంబర్లు సేకరించి.. వారితో ప్రేమగా మాటలు కలుపుతాడు. వారిపై వలపు వల విసిరుతాడు. ఈ క్రమంలోనే వ్యక్తిగత, ప్రైవేట్ చిత్రాలు సేకరించి తన కోర్కె తీర్చాలని వారిపై ఒత్తిడి తెస్తాడు. ఒకవేళ మాట వినకపోతే ప్రైవేటు ఫోటోలను ఇంటర్నెట్లో పోస్టుచేస్తానని బ్లాక్మెయిల్ చేసి వారితో.. ప్రశాంత్ తన కోరికలను తీర్చుకుంటూ వస్తున్నాడు. అయితే తాజాగా ఓ యువతి ప్రశాంత్ మోసాలపై దిశ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రశాంత్ను అదుపులోకి తీసుకుని ఫోన్ చెక్ చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే ప్రశాంత్ ఫోన్లో మహిళలు, యువతుల నగ్నచిత్రాలు, చాటింగ్ స్క్రీన్షాట్లు, వీడియోలను గుర్తించారు. అలాగే ఎనిమిది మంది అమ్మాయిలను మోసం చేసిన ఆధారాలు పోలీసులు సేకరించారు. దీంతో ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారని తెలుస్తోంది. కాగా, ఇలాంటి మోసాలు దేశవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి. మరియు ఇలాంటి మాయగాళ్ల వలలో ఎందరో మహిళలు చిక్కుకుని నరక యాతన అనుభవిస్తున్నారు.