మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ ఏడాది ప్రారంభంలో “అలా వైకుంఠపురం లో” సినిమా తో అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ తో తీసిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా బన్నీతో హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు త్రివిక్రమ్. ఇదిలావుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్లో 30 చిత్రం త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. 
 
కాగా గతంలోనే త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ తో "అరవింద సమేత వీర రాఘవ" అనే  ఫ్యాక్షన్ సినిమా తీసి నందమూరి అభిమానులకు భారీ బ్లాక్ బస్టర్ అందించడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఈసారి మాత్రం ఎన్టీఆర్ కెరీర్లో గుర్తుండిపోయే విధంగా సినిమా స్క్రిప్టు ఉండాలని త్రివిక్రమ్ ని నందమూరి అభిమానులు కోరుతున్నారట. ముఖ్యంగా రాజమౌళితో చేసిన తర్వాత సినిమా చేస్తున్న నేపథ్యంలో కచ్చితంగా ఎన్టీఆర్ కి ప్లాప్ పడకుండా ముందే జాగ్రత్తలు చెబుతున్నారట. దీంతో నరసింహ నాయుడు మరియు సమరసింహా రెడ్డి టైప్ లో బాలకృష్ణ నటించిన ఎనర్జిటిక్ స్టోరీ లాంటి సినిమాని ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. 
 
లాక్ డౌన్ టైం లో ఎక్కువ ఖాళీ సమయం దొరకడం తో ప్రతి సన్నివేశం చాలా వైవిధ్యంగా… నందమూరి ఫ్యాన్స్ ని అలరించే విధంగా త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని డిజైన్ చేసినట్లు ఫిలింనగర్లో టాక్. కరోనా వైరస్ కంట్రోల్ అయిన తర్వాత రాజమౌళితో చేయాల్సిన బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేయబోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాకి మళ్లీ తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: