డైరెక్టర్ మణిరత్నం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి చాలా ప్లాన్ లే వేస్తున్నాడు. అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. లైఫ్‌ అండ్‌ డెత్‌ లాంటి సిట్యువేషన్‌లో చేపట్టిన ప్రాజెక్టుతో ఫామ్‌లోకి వస్తాడా..? మునుపటి మార్కెట్‌ మార్క్‌ని అందుకుంటాడా అనే ప్రశ్నలకి సమాధానం రాబోతోంది. వచ్చే వానాకాలంలో అందరికీ జవాబు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు మణిరత్నం.

మణిరత్నం సరైన హిట్ కొట్టి చాలాకాలం అయింది. కార్తీ, అదితారావు హైదరీ లీడ్‌ రోల్స్‌లో వచ్చిన 'కాట్రువెలియిదై', అరవింద్‌ సామి, శింబు, విజయ్‌ సేతుపతి నటించిన 'చెక్క చివంత వానమ్' సినిమాలు ఫ్లాప్‌ అయ్యాక మణిరత్నం పనైపోయిందనే కామెంట్స్‌ వచ్చాయి. ఇలాంటి విమర్శల మధ్యలో 'పొన్నియన్‌ సెల్వన్' అనే భారీ హిస్టారికల్‌ డ్రామా మొదలుపెట్టాడు.

చోళులకాలంనాటి కథాంశంతో తెరకెక్కుతోంది 'పొన్నియన్ సెల్వన్'. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మణిరత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష లీడ్‌ రోల్స్‌ ప్లే చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీతో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కాలని ప్రయత్నిస్తున్నాడు మణిరత్నం.

'పొన్నియన్ సెల్వన్' సీరీస్‌లో మొదటిభాగం సమ్మర్‌లో రిలీజ్‌ అవుతుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మూవీని మణిరత్నం వేసవిలో విడుదల చేయడం లేదట. జులై లాస్ట్‌ వీక్‌లోగాని, ఆగస్ట్‌ సెకండ్‌వీక్‌లో గానీ విడుదల  చేయాలనుకుంటున్నాడట మణిరత్నం. మరి భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా మణిరత్నంకి ఎలాంటి ఫలితం అందిస్తుందో చూడాలి.


మొత్తానికి మణిరత్నం హిట్ కోసం చాలా పాట్లు పడుతున్నాడు. అందుకోసం ఆయన పడే కష్టాలు అన్నీ ఇన్నీకావు. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. పొన్నియన్ సెల్వన్ పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఆ సినిమా ద్వారా ఎలాగైనా హిట్ కొట్టాలని ఆశతో ఉన్నాడు మణిరత్నం. చూద్దాం.. ఆ చిత్రం మణిరత్నాన్ని గట్టెక్కిస్తుందా.. లేక డిసప్పాయింట్ చేస్తుందో. ప్రేక్షకులు మాత్రం ఈ విషయంలో చాలా ఆసక్తిగా చూస్తున్నారు.








మరింత సమాచారం తెలుసుకోండి: