చాలా తక్కువ సమయంలో ఎక్కువ నేమ్ మరియు ఫేం సంపాదించి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అవతారం ఎత్తుతున్నాడట విజయ్ దేవరకొండ. ఫ్లాపులు ఉన్నా కూడా అతడు నటించిన బ్లాక్ బస్టర్ల ముందు ఏదీ నిలబడలేదట.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నారు రౌడీ విజయ్ దేవరకొండ. దాదాపు 150 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తదుపరి సినిమా గురించిన ఓ ఆసక్తికర విషయం కూడా బయటకొచ్చింది. లైగర్’ కోసం గతంలో ఎప్పుడూ లేనంతగా అత్యధిక పారితోషికం అందుకోబోతున్నారని కొందరు అంటున్నారట.

మరి కొందరేమో ఈ సినిమా లాభాల్లో వాటా కూడా తీసుకునే అవకాశం ఉందనే సమాచారాలు తెగ షికారు చేస్తున్నాయట.మొత్తంగా లైగర్ ద్వారా విజయ్ దేవరకొండకు దాదాపు 20 కోట్లకు పైగా ముట్టే అవకాశం ఉన్నట్లుగా ప్రచారాలు జరుగుతున్నాయి.. అయితే సుకుమార్‌తో ఆయన చేయబోతున్న ఫ్యూచర్ ప్రాజెక్టు విషయంలో ఇది రెట్టింపు కానుందని తెలుస్తుంది.

క్రియేటివ్ డైరెక్టర్ అయిన సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండసినిమా చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘రాంపేజ్’ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారట. భారీ బడ్జెట్ కేటాయించి అన్ని హంగులతో రూపొందించనున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండఆర్మీ ఆఫీసర్‌గా నటించబోతున్నారని తెలుస్తుంది.ఈ సినిమాకు రెమ్మ్యూనరేషన్ తీసుకోవడంతో పాటు లాభాల్లో వాటా పంచుకునేలా విజయ్ దేవరకొండ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని తెలుస్తోంది.

స్టార్ హీరో స్టాటస్ ఎంజాయ్ చేస్తున్న రౌడీ ఇప్పుడు ఏం చేసినా పెద్ద న్యూస్ అవుతోందట.ఇదే పంథాలో ప్రతిదీ న్యూస్ అయ్యేందుకే రౌడీ ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. తాజాగా విజయ్ దేవరకొండ తన పెంపుడు కుక్క అయిన చార్టెడ్ ఫ్లైయిట్ ఎక్కించి బాంబే తీసుకెళ్లడం ఇప్పుడు అంత హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పలు రకాల టాక్స్ వినిపిస్తున్నప్పటికీ కూడా దేవరకొండ మాత్రం తాను అనుకున్న పని జరిగిందని హ్యాపీ ఫీల్ అవుతున్నట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: