తమిళ సినిమా ఇండస్ట్రీ లో హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న వారిలో దళపతి విజయ్ మరియు త్రిష కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు కూడా చాలా వరకు బ్లాక్ బస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి. ఇలా తమిళ సినిమా ఇండస్ట్రీ లో క్రేజీ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ తెరకేక్క బోతున్నట్లు తెలుస్తోంది.

మరి కొన్ని రోజుల్లో దళపతి విజయ్ , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తేరకెక్కబోయే మూవీ లో హీరో గా నటించ బోతున్న విషయం మనకు తెలిసింది. ఈ మూవీ దళపతి విజయ్ కెరియర్ లో 67 వ మూవీ గా రూపొంద పోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో దళపతి విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే విజయ్ , లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్టర్ మూవీ మంచి విజయం సాధించడం తో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్క బోయే రెండవ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దళపతి విజయ్ , వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కుతున్న వరిసు అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని 2023 సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో వారసుడు అనే పేరుతో డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: