ఇక ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమా పై హైప్ క్రియేట్ చేయగా.. ఈమధ్యే రిలీజ్ అయిన జై బాలయ్య మాస్ ఆంథేమ్ సాంగ్ అయితే నందమూరి అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతుంది. ఇప్పటికే ప్రతి ప్రమోషన్ మెటీరియల్‌ కు చాలా పెద్ద భారీ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన 'జై బాలయ్య' ఫస్ట్ సింగిల్ కూడా పెద్ద చార్ట్‌బస్టర్‌ గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి కాగా, ఒక్క పాట మాత్రమే ఇంకా షూటింగ్‌ కి మిగిలి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా స్పీడుగా జరుగుతున్నాయి.ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు మేకర్స్. 


తాజాగా సెకండ్ సాంగ్ సుగణ సుందరి సాంగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ చిత్రంలోని రెండో సాంగ్ సుగుణ సుందరిని డిసెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. వీరసింహా రెడ్డి జనవరి 12 వ తేదీన చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో బాలయ్య మాస్ ఎనర్జీని చూసి ఎంజాయ్ చేయండి అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేసింది. ఈ సాంగ్ ని టర్కీలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుంది.ఇక మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రిషి పంజాబీ టోగ్రఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాయగా , నవీన్ నూలి ఎడిటర్ గా ఇంకా ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. అలాగే చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: