రజనీకాంత్ అల్లుడు ధనుష్ సకల కళా వల్లభుడే. నటుడిగా జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకొన్నాడు. గాయకుడు కూడా. ప్రోఫెషనల్ సింగర్ స్థాయిలో పాటలు పాడేస్తాడు. అంతే కాదు, గీత రచయిత కూడా. తన పాటల్ని తానే రాసుకొంటాడు. కొలవెరి డీ పాట పాడింది, రాసింది ధనుషే. అంతేకాదు నిర్మాతగానూ మారాడు. ఇప్పుడు సరికొత్త అవతారంలో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు.
ధనుష్ త్వరలోనే మెగాఫోన్ పట్టుకోబోతున్నాడట. ఈ విషయం తనే స్వయంగా చెప్పాడు. ''దర్శకత్వం చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. అందుకోసం కొన్ని కథలు కూడా సిద్ధం చేసుకొన్నా. త్వరలోనే డైరెక్షన్ చేస్తా. అయితే హీరోగా చేయాల్సిన కొన్నిసినిమాలున్నాయి. వాటిని పూర్తిచేశాకే... మెగాఫోన్ పడతా. అయితే ఆ సినిమాలో హీరో నేనా, కాదా? అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేను'' అంటున్నాడు.
��
ధనుష్ హీరోగా నటించిన రామజానా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాకి బాలీవుడ్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా ఇచ్చిన నమ్మకంతోనే ఇకపై హిందీ సినిమాలపైనా దృష్టి పెడతా... అంటున్నాడు ధనుష్.