ప్రిన్స్ మహేష్బాబు నటిస్తున్న అప్కమింగ్ ఫిల్మ్ ఆగడు మూవీకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ను ఎపిహెరాల్డ్.కామ్ ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు తీసుకువస్తుంది. ఆగడు మూవీ షూటింగ్ దశలోనే ఉండగా ఈ మూవీకు సంబంబంధించిన ఓ రికార్డ్ వెలుగులోకి వచ్చింది. ప్రిన్స్ నటించిన గత చిత్రం వన్-నేనొక్కడినే, రిలీజ్కు ముందుగానే బిజినెస్ను క్లోజ్ చేసుకొని ఏ విధంగా రికార్డ్ క్రియోట్ చేసిందో, ఇప్పుడు ఆగడు మూవీ కూడ అదే తరహాలో రికార్డ్ను క్రియోట్ చేసింది.
ఆగడు మూవీకు సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ 6 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. యుఎస్కు చెందిన ఓ ఎన్.ఆర్.ఐ బిజినెస్ మెన్, ఆగడు మూవీ ఓవర్సీస్ను 6 కోట్ల రూపాయలకు కొన్నాడు. దీంతో ఆగడు మూవీకు సంబంధించిన ఓవర్సీస్ బిజినెస్ క్లోజ్ అయ్యిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆగడు మూవీ షూటింగ్ నానాక్రాం గూడలో జరుగుతుంది. ఈ బిజినెస్పై చిత్ర నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. ప్రిన్స్ నటిస్తున్న మూవీలు అన్నీ షూటింగ్కి ముందుగానే బిజినెస్లు జరగటంతో నిర్మాతలు సేఫ్ అవుతున్నారని టాలీవుడ్ టాక్.
ఎందుకంటే వన్ మూవీకు ముందుగానే బిజినెస్ జరగకపోతే నిర్మాతలు నష్టపోవల్సి ఉండేది. వన్-నేకొక్కడినే, ఆగడు మూవీలకు నిర్మాతలు ఒక్కరే కావడం, వారు ఈ తరహా ట్రెండ్ను స్వాగతిస్తున్నారు. ఆగడు మూవీలో ప్రిన్స్ సరసన మొదటిసారిగా తమన్న హీరోయిన్గా నటిస్తుంది.
ఆగడు మూవీకు ఓవర్సీస్ బిజినెస్ 6 కోట్లకు అమ్ముడుపోవడం, మూవీకు కలిసి వస్తుందా? లేదా? ఈ టాపిక్పై మీ అభిప్రాయలను ఇక్కడ తెలియపరచండి.
మరింత సమాచారం తెలుసుకోండి: