తెలుగు ఇండస్ట్రీలో మెగా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ కెరీర్ బిగినింగ్ లో ఆర్య చిత్రం ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు.  ఆ తర్వాత ఆర్య 2 చిత్రంతో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాడు సుకుమార్.  అయితే ఈ మూవీ ఎఫెక్ట్ చాలా కాలం వరకు అల్లు అర్జున్ తో మరో చిత్రం చేయలేకపోయాడు.  మద్యలో కొన్ని కథలు తీసుకు వెళ్లినా.. అవి పెద్దగా వర్క్ ఔట్ కాలేదని సమాచారం.  ఈ ఏడాది అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. 

 

అయితే ఈ చిత్ర కథ మొదట సుకుమార్ వినిపించినపుడు కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిందిగా బన్నీ కోరినట్లు సమాచారం.  ఈ నేపథ్యంలో కథను మరిన్ని మార్పులు చేసి బన్ని మెప్పు పొందాడట సుకుమార్.  వాస్తవానికి నివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున ‘నాపేరు సూర్య’ చిత్రంలో నటించి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నారు.  ఈ ఫ్లాప్ తో దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్.  ఈ చిత్రంలో బన్నీ లారీ డైవర్ గా నటించనున్నాడని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో బన్ని సరసన రష్మిక మందన నటిస్తుంది.  ఈ చిత్రం గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతుందట. 

 

ఈ చిత్రంలో బన్నీ ఊరమస్ లుక్ తో కనిపించబోతున్నారట.  అందుకే ఆయన లుక్ లో కూడా చాలా తేడా తీసుకు రాబోతున్నారట సుకుమార్.  తాజాగా ఈ చిత్రం గురించి మరో న్యూస్ వైరల్ అవుతుంది.  ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించనున్నాడట. ఇక విలన్ గా జగపతి బాబు నటించనున్నారని సమాచారం. బన్నీ - విజయ్ సేతుపతి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: