ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతుంది కరోనా వైరస్. ఈ వ్యాధి చైనాలో పుట్టి ప్రస్తుతం ప్రపంచ దేశాలను సైతం గడగడలాడిస్తోంది. చైనాలో ఈ వైరస్ తో బాధపడుతున్న వారి సంఖ్య తగ్గుముఖుం పట్టిన ఇటలీలో మాత్రం దీనిని ప్రభావం తగ్గడం లేదు. ఇటలీలో ఇప్పటికే కొన్ని వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది. అగ్రరాజమైన అమెరికా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంకా కొన్ని దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. 

 

మనదేశంలో కూడా ఈ వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. దేశంలో మొదట ఒక్కరోజు జనతా కర్ఫ్యూ ప్రకటించారు. జనతా కర్ఫ్యూ అనంతరం కూడా దేశంలో ఈ వైరస్ బాధితుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. దింతో కేంద్ర ప్రభుత్వం 21 రోజులు దేశంలో లాక్ డౌన్ విధించిన విషయం అందరికి తెలిసిందే. దేశంలో లాక్ డౌన్ విధించటంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం బాధపడకుండా ప్రభుత్వం కొన్ని పథకాలను అమలులోకి తీసుకొచ్చింది.

 

 

కరోనా మహమ్మారిని తెలుగు రాష్ట్రాల ప్రజలను కాపాడుకోవడం కోసం హీరోలు, రాజకీయ నాయకులు విరాళాలను అందిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ప్రకటించిన దగ్గరి నుండి ఆయన పూటకో సందేశంతో సంచలనం సృష్టిస్తున్నాడు. తాజాగా ఆయన మరో సంచలమైన సందేశం పంపారు. 

 

భూమిపై ఉన్న జీవుల్లో కేవలం మనం అంటే మనుషులు మాత్రమే ఉన్న ప్రాంతంలో ఉండకుండా.. ఎప్పుడు ఎక్కడో అక్కడ తిరుగుతూ ఉంటాం. అలా భూమికి సంబంధించిన సహజ వనవరులను నాశనం చేస్తున్నారన్నారు. ఇదే రకమైన పని చేసే మరో జీవి వైరస్ మాత్రమే అని తెలిపారు. భూమి అనే గ్రహానికి పట్టిన జబ్బు మానవులు అయితే మనుషులకు పట్టిన రోగం మాత్రం వైరస్ అని అన్నారు. ఈ ట్విట్ ను చదివిన వారి అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google:https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: