సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో అతి త్వరలో  సెట్స్ మీదకు వెళ్లనున్న సినిమా సర్కారు వారి పాట. 14 రీల్స్ ప్లస్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను ఎంతో భారీ ఖర్చుతో నిర్మించనున్నాయి. ఇటీవల అధికారిక పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాలో మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తుండగా యువ సంగీత తరంగం తమన్ మ్యూజిక్ ని మది ఫోటోగ్రఫీని అందిస్తున్నారు.
ఇటీవల మహేష్ బాబు జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ప్రేక్షకులు అభిమానుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకుంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే అమెరికాలో ప్రారంభం కావాల్సి ఉండగా అక్కడ ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండటంతో మరొక నెలన్నర పాటు షూటింగ్ వాయిదా వేసింది సర్కారు వారి పాట యూనిట్. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా జనవరి మొదటి వారంలో పట్టాలెక్కే ఛాన్స్ గట్టిగా కనబడుతుంది. కాగా ఈ సినిమా బ్యాంకు మోసాలు మరియు కుంభకోణాల నేపథ్యంలో  తెరకెక్కనుందని అలానే ఈ సినిమాని మహేష్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించనున్నాడని అంటున్నారు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర ని మహేష్ బాబు ముద్దుల తనయ సితార పోషించనున్నట్లు చెబుతున్నారు. సినిమాలో హీరోయిన్ చిన్నతనంలో వచ్చే రోల్ కి సితారని ఎంపిక చేశారట దర్శకనిర్మాతలు. అలానే ఈ విషయమై మహేష్, నమ్రత ఇద్దరూ కూడా ఒప్పుకున్నారని ఇక సితార కి ఈ రోల్ టాలీవుడ్లో మంచి ఎంట్రీ గా నిలుస్తుందని వారిద్దరూ భావిస్తున్నట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఇదే గనుక నిజమైతే మాత్రం నిజంగా ఇది సూపర్ స్టార్ ఫాన్స్ కి సూపర్ న్యూస్ అని చెప్పక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: