ప్రస్తుతం కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 కి ఒకప్పటితో పోలిస్తే మంచి స్థాయిలోనే  టిఆర్పి రేటింగ్స్ వస్తున్నట్లు సమాచారం.  ఓవైపు నాగార్జున తనదైన హోస్టింగ్ టాలెంటుతో షో ని ముందుకు తీసుకు వెళుతుండగా మరోవైపు బిగ్ బాస్ ఎప్పటికప్పుడు హౌస్ మేట్స్ కి పలు ఇంట్రెస్టింగ్ టాస్క్ లు ఇస్తూ షో పై ప్రేక్షకాభిమానుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఇప్పటికే ఈ షో 12 వారాలు సక్సెస్ఫుల్ గా పూర్తిచేసుకుని ఇటీవల 13 వారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం హౌస్ లో మొత్తం ఏడుగురు కంటస్టెంట్స్ ఉండగా వీరిలో అభిజిత్, అఖిల్, అవినాష్, మోనాల్, హారిక తదితరులు ఎలిమినేషన్  జోన్లో ఉన్నారు.

మరి వీరిలో ఈవారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారో తెలియాలి అంటే మరొక రెండు రోజులు వెయిట్ చేయాలి. ఇకపోతే ఈ షో ముగియడానికి మరో 20 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఫైనల్ విజేతగా ఎవరు నిలుస్తారు అనే దానిపై అభిమానుల్లో ఎప్పటికప్పుడు ఉత్కంఠ విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే షోలో అభిజిత్, సోహైల్, హారిక, అరియనా లకు ఒకింత భారీస్థాయి ఓట్లు వస్తున్నట్లు సమాచారం. అయితే వీరిలో చివరి వరకు నిలిచి ఎవరు టాప్ 2 లో ఎవరు ఉంటారో అలానే విన్నింగ్ టైటిల్ ఎవరు గెలుస్తారో చూడాలి. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే ఈ షో కి సంబంధించి జరగబోయే గ్రాండ్ ఫినాలే కి టాలీవుడ్ కి చెందిన టాప్ స్టార్ ఒకరు ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నారట. గతంలో జరిగిన పలు బిగ్ బాస్ సీజన్స్ లో కూడా ఇటువంటి పద్ధతిని అనుసరించిన బిగ్ బాస్ టీం ఈ ఏడాది కూడా ఒక టాప్ మోస్ట్ సెలబ్రిటీ తీసుకురానున్నారని అంటున్నారు.

అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి వారి పేర్లు ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ప్రముఖంగా వినిపిస్తుండడంతో వీరిలో ఎవరో ఒకరు గ్రాండ్ ఫినాలే కి ప్రత్యేక అతిథిగా వస్తారని అంటున్నారు. కాగా ఈ విధానం ద్వారా షో పై మరింత ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించాలనేది బిగ్ బాస్ టీం యొక్క ఆలోచనని తెలుస్తోంది. మరి ఈ తాజా సీజన్ గ్రాండ్ ఫినాలే కి ఎవరు ప్రత్యేక అతిథిగా వస్తారో తెలియాలి అంటే మరొక మూడు వారాల వరకు వెయిట్ చేయాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: