మరి వీరిలో ఈవారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారో తెలియాలి అంటే మరొక రెండు రోజులు వెయిట్ చేయాలి. ఇకపోతే ఈ షో ముగియడానికి మరో 20 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఫైనల్ విజేతగా ఎవరు నిలుస్తారు అనే దానిపై అభిమానుల్లో ఎప్పటికప్పుడు ఉత్కంఠ విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే షోలో అభిజిత్, సోహైల్, హారిక, అరియనా లకు ఒకింత భారీస్థాయి ఓట్లు వస్తున్నట్లు సమాచారం. అయితే వీరిలో చివరి వరకు నిలిచి ఎవరు టాప్ 2 లో ఎవరు ఉంటారో అలానే విన్నింగ్ టైటిల్ ఎవరు గెలుస్తారో చూడాలి. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే ఈ షో కి సంబంధించి జరగబోయే గ్రాండ్ ఫినాలే కి టాలీవుడ్ కి చెందిన టాప్ స్టార్ ఒకరు ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నారట. గతంలో జరిగిన పలు బిగ్ బాస్ సీజన్స్ లో కూడా ఇటువంటి పద్ధతిని అనుసరించిన బిగ్ బాస్ టీం ఈ ఏడాది కూడా ఒక టాప్ మోస్ట్ సెలబ్రిటీ తీసుకురానున్నారని అంటున్నారు.
అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి వారి పేర్లు ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ప్రముఖంగా వినిపిస్తుండడంతో వీరిలో ఎవరో ఒకరు గ్రాండ్ ఫినాలే కి ప్రత్యేక అతిథిగా వస్తారని అంటున్నారు. కాగా ఈ విధానం ద్వారా షో పై మరింత ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించాలనేది బిగ్ బాస్ టీం యొక్క ఆలోచనని తెలుస్తోంది. మరి ఈ తాజా సీజన్ గ్రాండ్ ఫినాలే కి ఎవరు ప్రత్యేక అతిథిగా వస్తారో తెలియాలి అంటే మరొక మూడు వారాల వరకు వెయిట్ చేయాలి....!!