మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా లాంచ్ అవుతున్న హీరో వైష్ణవ తేజ్. మెగాస్టార్ చిన్న మేనల్లుడు అయిన ఈయన పెద్దగా కష్టపడకుండానే మొదటి సినిమా ఆఫర్ పట్టుకున్నాడు. సుకుమార్ దగ్గర శిష్యుడిగా పనిచేసినన్న బుచ్చిబాబు అనే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటినుంచి ప్రేక్షకుల ఎట్రాక్షన్ ని సంపాదించింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ అంతా ఎప్పుడో పూర్తి అయి పోయింది. గత ఏడాది ఏప్రిల్ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. 

కానీ అనుకోకుండా వచ్చి పడిన కరోనా కారణంగా ఈ సినిమా దాదాపు ఏడాది పాటు వాయిదా పడింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని వచ్చే నెల 5వ తారీఖున రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు మేకర్స్ వీలైనంత త్వరగా అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో వైష్ణవ తేజ్ సరసన కృతి శెట్టి నటించింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఒక నెగిటివ్ రోల్ పోషిస్తున్నారు. 

ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అన్ని పాటలు దాదాపుగా మంచి చార్ట్ బస్టర్స్ గా మిగిలాయి. నీ కన్ను నీలి సముద్రం అనే పాట అయితే జనాల్లోకి బాగా చొచ్చుకు వెళ్ళింది. ఇక నిన్న కూడా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయగా అది ఈ సినిమా మీద అంచనాలు మరింత పెంచేసిందని చెప్పాలి. ఇక ఈ సినిమా రిలీజ్ కూడా అవ్వకుండానే ఈయన హీరోగా రెండో సినిమా కూడా పూర్తి అయి పోయింది. క్రిష్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కూడా త్వరలోనే రిలీజ్ కి సిద్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: