ద‌ర్శ‌కుడు పూరీ జ‌గన్నాథ్ త‌న కుమారుడు ఆకాష్‌ను నిల‌బెట్టే దిశ‌గా గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్నారు. సినిమా సినిమాకు మెరుగ‌య్యేలా శిక్ష‌ణ ఇవ్వ‌డంతోపాటు చేసే సినిమా క‌థ‌ల‌ను కూడా జాగ్ర‌త్త‌గా ఎంచుకుంటూ వ‌స్తున్నారు. తొలిసినిమా మెహ‌బూబా నిర‌శ‌ప‌ర‌చ‌డంతో పూరీ త‌న త‌న‌యుడి రెండో సినిమాపై పూర్తిస్థాయి శ్ర‌ద్ధ పెట్టారు. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, చార్మి సంయుక్తంగా ఆకాష్ రెండో సినిమా నిర్మిస్తున్నారు.

రొమాంటిక్ సినిమాకు సంబందించి ఛార్మి అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆకాష్ తొలి సినిమా 'మెహబూబా' నిరాశ పర్చడంతో తన స్టైల్ మేకింగ్‌తో రొమాంటిక్ మూవీ చేస్తున్నారు. ఆకాష్ రెండో సినిమాగా ఈ 'రొమాంటిక్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే పూరీ అందిస్తుండగా.. ఆయన శిష్యుడు అనిల్ పాదూరి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఆకాష్ జంటగా హాట్ బ్యూటీ కేతికాశర్మ నటిస్తోంది.

గోవా లోని అందమైన లొకేషన్స్‌లో రొమాంటిక్ సీన్స్ షూట్ చేసిన చిత్రయూనిట్ ఇటీవలే షూటింగ్ మొత్తం పూర్తిచేసింది.  2021 జూన్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమాను విడుద‌ల చేయనున్నట్లు పూరి జగన్నాథ్ ప్రొడ్యూసింగ్ పార్ట్‌నర్ ఛార్మి అధికారికంగా ప్రకటించింది.  రొమాంటిక్ పోస్టర్ వదులుతూ.. రొమాంటిక్ కిక్‌తో థియేటర్స్ లోకి రాబోతున్నామ‌ని,  రమ్యకృష్ణ పవర్‌ఫుల్ న‌ట‌న చూడటానికి సిద్ధంగా ఉండండ‌ని ఛార్మి పేర్కొంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర చాలా కీల‌క‌మ‌ని స‌మాచారం. ఈ సినిమాలో రొమాంటిక్ డోస్ బాగా దట్టించారని, కథాకథనాలతో పాటు రొమాంటిక్  సన్నివేశాలు ప్రేక్షకులను కట్టి పడేస్తాయని చిత్రయూనిట్ చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ఓ బీచ్ సాంగ్‌కు స్పంద‌న బాగా వ‌చ్చింది. ఈ సినిమాతో అయినా ఆకాష్ పూరి ట్రాక్ ఎక్కుతాడా? లేదా? అనేది వేచిచూడాలి!!

మరింత సమాచారం తెలుసుకోండి: