ప్రపంచ వ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకు ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జేమ్స్ బాండ్ సినిమాలు వస్తున్నాయంటే చాలు వాటి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు జేమ్స్ బాండ్ అభిమానులు. ఒక్క జేమ్స్ బాండ్ అభిమానులే కాదు.. యావత్ సినీ ప్రేక్షకులు జేమ్స్ బాండ్ సినిమాల కోసం ఆసక్తిగా ఎెదురు చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా జేమ్స్ బాండ్ ‘నో టైం టూ డై’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. అయితే సినిమా ఇంతకు మునుపే రిలీజ్ కావాల్సి ఉండే. కానీ కరోనా కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోందని  వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తెలుగు ప్రేక్షకుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి.
అయితే జేమ్స్ బాండ్ సినిమా 2020 లో నవంబర్ 20 రిలీజ్ కావాల్సి ఉండే. కానీ అమెరికాలో కరోనా మహమ్మారి విస్తరించడంతో అది కాస్త వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను వైల్డ్ వైడ్ గా ఈ సంవత్సరంలో అక్టోబర్ 8న రిలీజ్ కానున్నట్టు ఈ చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా అక్టోబర్ లోనే రిలీజ్ చేయనున్నట్టు రాజమౌళి ప్రణాళిక రూపొందిస్తున్నాడని సమాచారం.

అందుకోసమే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను ఈ సమ్మర్ లోగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట. ఈ మూవీ కూడా వైల్డ్ వైడ్ గా రిలీజ్ చెయ్యబోతున్నారన్న సంగతి తెలిసిందే. అయితే వైల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్న జేమ్స్ బాండ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు క్లాష్ అయ్యే అవకాశం లేకపోలేదని కొందరు భావిస్తున్నారు. ఈ మూవీతో ఢీ కొట్టడం ఇష్టం లేక ఆర్ఆర్ఆర్ సినిమాను దసరాకు కాకుండా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపాలని డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్టర్ ను కోరారట. చూడాలి మరి రాజమౌళి ఏ నిర్ణయం తీసుకోనున్నారో..

మరింత సమాచారం తెలుసుకోండి: