ప్రస్తుతం మెల్లగా కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులు మన దేశంలో తగ్గుముఖం పడుతూ ఉండడంతో ఒక్కోరంగానికి సడలింపులు ఇస్తూ అలానే లాక్ డౌన్ ని విడతల వారీగా ఎత్తేస్తూ పోతున్నాయి పలు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక రేపటి నుండి తెలంగాణ లో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తి వేయడంతో అన్ని కార్యకలాపాలు పూర్తి స్థాయిలో కొనసాగనుననట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలో సినిమాల షూటింగ్స్ ప్రారంభము అవ్వడంతో పాటు సినిమా హాల్స్ కూడా తెరుచుకోనున్నాయి.
ఇక ఇప్పటికే విడుదలకు రెడీ గా ఉన్న సినిమాల యొక్క మేకర్స్ త్వరలో తమ సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా పలు ఫిలిం నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి త్వరలో మొట్టమొదటగా థియేటర్స్ లో విడుదలయ్యే సినిమాల జాబితాలో నాగ చైతన్య నటిస్తున్న లవ్ స్టోరీ అలానే అఖిల్ యాక్ట్ చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు ఉండనున్నట్లు సమాచారం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్న లవ్ స్టోరీ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ అన్ని కూడా మూవీపై అందరిలో భారీ గా అంచనాలు ఏర్పరిచాయి.
మంచి ఎమోషనల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా తో నాగచైతన్య మరొక సక్సెస్ కొట్టడం ఖాయం అంటున్నారు. మరోవైపు మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్, ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాకి గోపిసుందర్ అందించిన సాంగ్స్ పెద్ద ప్లస్ అవడంతో పాటు అవి సినిమాపై భారీ హైప్ తీసుకువచ్చాయి. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్లు టాక్. ఇక ఈ ఇద్దరు అక్కినేని హీరోల సినిమాల కేవలం వారం గ్యాప్ లోనే బాక్సాఫీస్ బరిలో నిలవనున్నారని త్వరలో వారి సినిమాల రిలీజ్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ కూడా రానున్నాయని అంటున్నారు .... !!

మరింత సమాచారం తెలుసుకోండి: