ఇక బుల్లితెర బ్యూటిఫుల్‌ యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ షో ద్వారా బాగా దగ్గరైన సంగతి తెలిసిందే.ఇక ఆమె తన హాట్ స్కిన్ షో తో తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది .ఇక అటు యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కొన్ని ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ అలరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ తన అందంతో అలరిస్తూనే ఉంటుంది. ఇంకా అలాగే 'రంగస్థలం' సినిమాలో 'రంగమ్మత్త'గా నటించి ఎన్నో ప్రశంసలు దక్కించుకుంది. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్' సినిమాలో కూడా దాక్షాయణిగా చేసి మరింత పేరు తెచ్చుకుంది అనసూయ. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్‌' చిత్రంలో మరో ప్రత్యేకమైన రోల్‌లో కూడా ఆకట్టుకునేందుకు రెడీగా ఉంది అనసూయ.ఇంకా అలాగే తాజాగా మరో క్రేజీ పాత్రలో అనసూయ నటించనున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.ఇక మన తెలుగు జాతి గర్వపడే తెలుగు మహా రచయిత అయిన గురజాడ అప్పారావు రచించిన క్లాసిక్‌ నాటకం కన్యాశుల్కం మనం చిన్నప్పుడు మన పాఠ్య పుస్తకాల ద్వారా తెలుసుకొనే ఉంటాము.


ఇక అది ఎంత బాగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ కథతో టాలీవుడ్ టాలెంటెడ్ స్టార్‌ డైరెక్టర్‌ క్రిష్ జాగర్లమూడి ఒక వెబ్‌సిరీస్‌ను రూపొందించనున్నాడట. ఇక అలాగే ఈ వెబ్‌ సిరీస్‌కు ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తూ కథ-కథనం స్క్రిప్ట్ బాధ్యతలన్నీ క్రిష్‌ చూసుకోనున్నాడని సమాచారం తెలుస్తోంది. ఇక ఈ సిరీస్‌లో భాగంగా మధురవాణి అనే వేశ్య పాత్రలో హాట్ బ్యూటీ అనసూయ నటించనున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇక ఈ రోల్‌లో నటించేందుకు అనసూయ సైతం ఓకే చెప్పిందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్రకు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకోసం ఆమె జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసింది. జబర్దస్త్ కి గుడ్ బై చెప్పి పెద్ద తప్పు చేసింది అంటూ అనేక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: