అయితే ఎన్ని వివాదాలు ఉన్నా సరే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ కేంద్ర పెద్దల తీరు మాత్రం అలా లేదు. ప్రస్తుతం ఢిల్లీ పెద్దలను కలిసేందుకు ఎన్ని సార్లు ప్రయత్నించినా కూడా తెలంగాణ మంత్రులకు నిరాశే మిగులుతోంది. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసినా కూడా.... ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ లభించలేదు. అదే సమయంలో... బద్ద విరోధి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాత్రం... ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అటు రాష్ట్ర మంత్రులు కూడా కేవలం పియూష్ గోయల్తో మాత్రమే భేటీ అయ్యారు. ఆయనతో జరిపిన చర్చలు కూడా విఫలం కావడంతో... తెలంగాణ మంత్రులు ఏం చేయలేని దుస్థితిలో ఖాళీ చేతులతోనే హైదరాబాద్ చేరుకున్నారు. తమకు జరిగిన అవమానంపై ముఖ్యమంత్రికి వివరించారు. ఇక భవిష్యత్తు కార్యాచరణపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్లాన్ ప్రకారం ప్రస్తుతం ముందుకు వెళ్లాలని అంతా భావిస్తున్నారు కూడా.
అయితే ఎన్ని వివాదాలు ఉన్నా సరే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ కేంద్ర పెద్దల తీరు మాత్రం అలా లేదు. ప్రస్తుతం ఢిల్లీ పెద్దలను కలిసేందుకు ఎన్ని సార్లు ప్రయత్నించినా కూడా తెలంగాణ మంత్రులకు నిరాశే మిగులుతోంది. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసినా కూడా.... ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ లభించలేదు. అదే సమయంలో... బద్ద విరోధి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాత్రం... ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అటు రాష్ట్ర మంత్రులు కూడా కేవలం పియూష్ గోయల్తో మాత్రమే భేటీ అయ్యారు. ఆయనతో జరిపిన చర్చలు కూడా విఫలం కావడంతో... తెలంగాణ మంత్రులు ఏం చేయలేని దుస్థితిలో ఖాళీ చేతులతోనే హైదరాబాద్ చేరుకున్నారు. తమకు జరిగిన అవమానంపై ముఖ్యమంత్రికి వివరించారు. ఇక భవిష్యత్తు కార్యాచరణపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్లాన్ ప్రకారం ప్రస్తుతం ముందుకు వెళ్లాలని అంతా భావిస్తున్నారు కూడా.