ఈ విషయం తెలియగానే ఒక్క సారిగా ఆ ప్రాంత వాసులు అందరూ షాక్ అయ్యారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ శవం దాదాపుగా 50 రోజుల ముందు నుండే ఈ ట్యాంక్ లో పడి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇన్ని రోజులు శవం నీటిలో ఉండడం వల్ల బాగా కుళ్లిపోయింది. ఈ ట్యాంక్ లో ఉన్న నీరు శివ స్తాన్ పుర్, ఎస్ ఆర్ కె నగర్, పద్మశాలి సంఘం, జాతి నగర్ కాలనీ లలో జీవించే వారంతా తాగుతున్నారు. ఈ పరిస్థితిని ఆలోచిస్తేనే అతి భయంకరంగా ఉంది. అయితే ఈ శవం ఎవరిది? ఇలా ఎవరి పడేశారు? అన్న విషయాలపై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న ప్రజలు చెబుతున్న ప్రకారం ఈ ట్యాంక్ కు సరైన మెయింటైన్ చేయకపోవడంతో ఇలా అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారిందని అంటున్నారు.
ఈ విషయంలో జలమండలి పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శలు వస్తున్నాయి. అంతే కాకుండా ఇలా జరిగిన తర్వాత కూడా ఎటువంటి నీటి సౌకర్యం కల్పించకపోవడం చాలా దారుణమని అంటున్నారు. ఇదే విషయాన్ని జల మండలిని అడిగినా వాటర్ ట్యాంకర్లు అందుబాటులో లేవని కుంటి సాకు చెబుతున్నారని వాపోతున్నారు అక్కడి వాసులు. ఈ వాటర్ తాగిన స్థానికులు ఆయాసం, గొంతులో ఇబ్బంది మరియు ఇతరత్రా సమస్యలు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనితో అక్కడి ఉన్న వారు భయకంపితులు అవుతున్నారు. అయితే ఈ శవం పడిన నీరు తాగడం వలన ఏమైనా రోగాలు వచ్చాయా అన్నది తెలుసుకోవడానికి ఎటువంటి హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.