హైదరాబాద్లో ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కరోనా వైరస్ కట్టడికి, వచ్చే సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా అట్టడుగు, పేద వర్గాలకు వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానలను మరింత విస్తృతం చేస్తోంది. శుక్రవారం కొత్తగా మరో 45 వైద్యశాలలను మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ ప్రారంభిస్తున్నారు. వీటి కోసం భవన నిర్మాణాలు పూర్తి చేసి సిబ్బందిని నియమించారు. కాగా గ్రేటర్లో ఇప్పటికే 123 బస్తీ దవాఖానలు సేవలందిస్తున్నాయి. నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీతో పాటు వైద్య పరీక్షలు చేసి మందులు అందిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్ జిల్లా పరిధిలో 74, రంగారెడ్డి పరిధిలో 23, మేడ్చల్లో 26 ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఓపీతో పాటు వైద్య పరీక్షలు చేసి మందులు అందిస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ రోగులకు బీపీ, షుగర్, మలేరియా, టైఫాయిడ్ లాంటి 55 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తూ 125 రకాల మందులను అందుబాటులో ఉంచినట్లు వైద్యాధికారులు తెలిపారు. బస్తీ దవాఖానలు ఈ ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి. చార్మినార్ జోన్లో.. మిలత్నగర్, నిమ్రాకాలనీ, చాంద్రాయణగుట్ట, సైదాబాద్, డా.జాఖీర్ హుస్సేన్ కాలనీ, క్యాలెండర్ నగర్ కమ్యూనిటీహాల్, రాజేంద్రనగర్, కొండాపూర్. ఖైరతాబాద్ జోన్లో కమాటిపుర కమ్యూనిటీహాల్, జీహెచ్ఎంసీ కమ్యూనిటీహాల్, హనుమన్టేక్డీ, ఎన్.బీ నగర్, బంజారాహిల్స్, ఇంద్రనగర్ జీవైఎం సెంటర్, వెంకటేశ్వరనగర్,అంబికా మహిళా మండలి, కమ్యూనిటీహాల్, జూబ్లీహిల్స్, పీజేఆర్ నగర్ కమ్యూనిటీహాల్, బీసీ వడ్డెర బస్తీ కమ్యూనిటీహాల్, ఎంజీ నగర్, దత్తాత్రేయణ, ఆసిఫ్నగర్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, భోజగుట్ట. సికింద్రాబాద్ జోన్లో శివాజీనగర్ కమ్యూనిటీ హాల్, డొక్కాలమ్మ దేవాలయం, చేపలబాయ్, మోండామార్కెట్, విజయపురి కాలనీ, తార్నాక, డీ.ఎస్ నగర్, కవాడిగూడ, ఉమదానగర్ కమ్యూనిటీ హాల్.
కూకట్పల్లి జోన్లో ద్వారకానగర్, కుత్బుల్లాపూర్, అంబేద్కర్ నగర్, కొత్తబస్తీ, మహిళామండలి భవన్, కుషాయిగూడ, రంగారెడ్డి నగర్, కుత్బుల్లాపూర్, కేపీహెచ్బీ ఫేస్-4, కేపీహెచ్బీ కాలనీ, అల్వాల్, అరుంధతి, కమ్యూనిటీ హాల్, తుర్కపల్లి, మోడల్ మార్కెట్, భగత్సింగ్నగర్, చింతల్, నందన నగర్, రంగారెడ్డి, వెంకటేశ్వర కమ్యూనిటీ హాల్. ఎల్బీనగర్ జోన్లో అశోక్నగర్, సింగం చెరువు, వివేకానందనగర్, కాప్రా, కమలానగర్ కమ్యూనిటీ హాల్, కుషాయిగూడ, సాయిరాంనగర్ కమ్యూనిటీహాల్, కుషాయిగూడ,సాహెబ్నగర్,బీఎన్రెడ్డి కాలనీ, సరూర్నగర్, అధికారి నగర్, సరూర్నగర్,కామేశ్వరరావు కాలనీ, శేరిలింగంపల్లి జోన్లో పటాన్చెరు, చైతన్యనగర్ కాలనీ, కనుకుంట, గవర్నమెంట్ స్కూల్, ఆర్సీ పురం, ప్రేమ్నగర్ కమ్యూనిటీ హాల్, కొండాపూర్, కార్మికనగర్ కమ్యూనిటీహాల్, రామంతానగర్, యాదగిరినగర్ కమ్యూనిటీహాల్, సుల్తాన్నగర్ కమ్యూనిటీహాల్, ఎర్రగడ్డలో సేవలు అందిస్తున్నాయి.