ఒక తెలుగు వాడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా వెళ్తుంటే సంతోష పడకుండా దాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. న్యాయవ్యవస్థపై కామెంట్లు చేస్తున్న వైసీపీ నేతలను దేశం మొత్తం చీ కొడుతున్నప్పటికీ ... వారి తీరు లో ఉన్న మాత్రం మార్పు రావడం లేదు అంటూ విమర్శించారు చంద్రబాబు నాయుడు. ఇక ఇటీవలే ఢిల్లీ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదికలో సీఎం జగన్ కు 30 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పింది అంటూ చంద్రబాబు ప్రస్తావించారు.
అంత అవినీతిపరుడైన సీఎం జగన్ ప్రస్తుతం ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో న్యాయవ్యవస్థపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. తెలుగువారందరికీ చెడ్డ పేరు తెచ్చే విధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అంటూ ఆరోపించిన చంద్రబాబు నాయుడు... రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది అంటూ విమర్శించారు. గూండాలు రౌడీల దాడులు పెరిగిపోయాయని... దళితులకు మహిళలకు ఆడబిడ్డలకు రక్షణ లేదు అంటూ విమర్శించిన చంద్రబాబు.. జగన్ తీసుకొచ్చిన దిశ చట్టం కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైంది అంటూ విరుచుకుపడ్డారు.