“మా చిరకాల స్వప్నం అయిన మాధవ నగర్ 4 లేన్ ఆర్ ఓ బీ శాంక్షన్ చేస్తూ మినిస్ట్రీ అఫ్ రైల్వేస్ నుండి లెటర్ అందింది. దశాబ్ద కాలానికి పైగా ఎదురు చూసిన మాధవ నగర్, ఆర్ ఓ బీ కి మినిస్ట్రీ అఫ్ రైల్వేస్ ఆమోదం తెలిపింది. నేను బీజేపీ పార్టీలో చేరిన కొద్దీ రోజులకే ఈ ఆర్ ఓ బీ పై పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి తీవ్ర ప్రయత్నం చేశాను. ఎంపీ అయ్యాక, ఈ ఫైలుని మినిస్ట్రీ అఫ్ రైల్వేస్ దృష్టికి తీసుకెళ్లగా, వారు సంసిద్ధత వ్యక్తం చేసి, రాష్ట్ర ప్రభుత్వ వాటాని కూడా తన ఆమోదం తెలపాలని సూచించారు.
సెప్టెంబర్ లో జరిగిన దిశ మీటింగ్ లో ఆర్ అండ్ బీ అధికారులను ఈ విషయమై తీవ్రంగా మందలించగా, మూడు రోజులకే ఆ మంత్రిత్వ శాఖ నుండి నివేదికలు వెళ్లి, ఎట్టకేలకు ఆర్ ఓ బీ శాంక్షన్ అయ్యింది. నిజామాబాద్ నుండి హైదరాబాద్ కి వెళ్లే ఈ మార్గంలో ఎన్నో వాహనాలతో పాటు అంబులెన్సులు గంటల తరబడి రైల్వే గేట్ దగ్గర నిరీక్షించాల్సి వస్తుంది. ఈ ఆర్ ఓ బీ నిర్మాణం సంవత్సరం లోపు పూర్తి చేసి, ఈ ఇబ్బందులను తొలగించాలి” అని ఆయన ఒక ప్రకటన చేసారు.