ఇక ఇదే నైజాం పాలనలో ఉన్న ఔరంగాబాద్, ధర్మాబాద్, నాసిక్, నాందేడ్ మహారాష్ట్రలోకి వెళ్లిపోయాయి. ఈ క్రమంలోనే కర్నాటక సరిహద్దులో ఉన్న బెళగావి ప్రాంతాన్ని తిరిగి బాంబేలో కలపాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు. వారంతా మరాఠీయే మాట్లాడతారు. అప్పట్లో బెళగావి ప్రాంతాన్ని కర్నాటకలో కలపడంపై మహారాష్ట్రలో పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు జరిగాయి. మహారాష్ట్ర ప్రజలు దీనికి వ్యతిరేకంగా గళమెత్తారు. మహారాష్ట్ర ఏకీకరణ సమితి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. దాదాపు 10 మంది అప్పట్లో ప్రాణాలు కోల్పోయారు.
ఈ గొడవ ఇలా జరుగుతూ ఉండగానే తాజాగా ఇది రాజకీయ పరమైన చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే సంచలన మెసేజ్ చేశారు. కర్ణాటక ఆధీనంలో ఉన్న ప్రాంతాలను మహారాష్ట్రలో కలుపుతామని ఆయన సోషల్ మీడియా సాక్షిగా తెలిపారు. దీంతో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య వివాదం రాజుకుంది. దీనిని కర్నాటక సీఎం యడ్యూరప్ప తీవ్రంగా ఖండిస్తున్నారు. బెళగావి ప్రాంతం ఎప్పటకీ కర్నాకటలోనే ఉంటుందని చెపుతున్నారు. ఓ ప్రాంతం కోసం ఏకంగా ఇద్దరు సీఎంలు మాటల యుద్ధానికి దిగడంతో ఇక్కడ రాజకీయ వేడి రాజుకోనుంది.