టీడీపీ గత ఐదేళ్ల పాటు అధికారంలో ఉండడంతో పార్టీకి కావాల్సినన్ని వనరులు పుష్కలంగా దొరికేశాయి. పార్టీ నేతలు కాని.. పార్టీ కార్యక్రమాలు కాని మాంచి ధూమ్ధామ్గా జరిగేవి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. పార్టీకి ప్రజల్లో ఇప్పట్లో నమ్మకం లేనంత ఘోరంగా ఓడిపోవడం ఒక షాక్ అయితే.. ఇప్పుడు పార్టీకి ఆర్థికంగా పెద్ద దిక్కుగా ఉన్న నేతలను అందరిని వైసీపీ పార్టీకి దూరం చేస్తోంది. మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు లాంటి నేతలు కూడా ఇలాగే బయటకు వెళ్లిపోయారు.
వైసీపీ ప్రత్యేకంగా తెలుగు దేశం పార్టీ ఆర్ధిక మూలాలను వెతికి వెతికి మరీ దెబ్బ కొడుతోంది. ఇక ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్గా పేరున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్లే ఇప్పుడు ఫుల్ సైలెంట్గా ఉన్నారు. ఇక ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్లు పూర్తిగా సైలెంట్ అయిపోవడమో లేదా తమ తమ నియోజకవర్గాలకే పరిమితం కావడమో చేస్తున్నారు. ఇక త్వరలో తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగే ఉప ఎన్నికతో పాటు పలు ఎన్నికలను కూడా ఎలా ఎదుర్కోవాలో తెలియక టీడీపీ తీవ్రంగా సతమత మవుతోంది.
ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే వచ్చే ఎన్నికలకు యేడాదిన్నర ముందు నుంచి మరిన్ని ఖర్చులు ఉంటాయి. అప్పుడు పార్టీ అధిష్టానం.. పార్టీ నేతలు ఎలా తట్టుకుని నిలబడతారు ? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.