రాజద్రోహం కేసులో బెయిల్ మీద బయటకొచ్చిన రఘురామ, ఢిల్లీ స్థాయిలో జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నారు. అలాగే జగన్ పలు హామీలని అమలు చేయలేదని వరుసపెట్టి లేఖలు రాస్తున్నారు. ఇక రఘురామ రాజకీయం మరీ ఎక్కువైపోవడంతో, ఆయన్ని వైసీపీ నుంచి సస్పెండ్ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. రఘురామ ఎంపీ పదవిపై స్పీకర్ వేటు వేసే విషయంలో క్లారిటీ లేదు. అందుకే రాజుగారిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని చూస్తున్నారు.
ఇప్పటికే వైసీపీ అధికారిక వెబ్సైట్లో ఎంపీల లిస్ట్ నుంచి రఘురామకృష్ణంరాజు పేరు తొలగించారు. అలాగే రేపోమాపో రఘురామని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఖాయమని చిత్తూరు వైసీపీ ఎంపీ రెడ్డప్ప అంటున్నారు. ఒకవేళ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రఘురామకే లైన్ క్లియర్ అయినట్లే. ఎందుకంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తనని ఇండిపెండెంట్గా పరిగణించాలని స్పీకర్ని కోరతానని రఘురామ చెప్పేశారు. ఒకవేళ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకపోయిన రఘురామ ఇండిపెండెంట్ ఎంపీగా ఉండిపోతారు. ఇక అప్పుడు మరింతగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడతారు. అంటే వచ్చే ఎన్నికల వరకు వైసీపీకి రఘురామ తలనొప్పి పోయేలా కనిపించడం లేదు.