రఘురామకృష్ణంరాజు తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన సొంత ఇమేజ్ మీద గెలవడం కష్టం. ఒకవేళ ఆయన బీజేపీ నుంచి పోటీ చేసినా నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఆ పార్టీకి బలం లేనందున అలాగూ విజయం సాధించలేరు. అయితే ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థి నాగబాబుకు రెండు లక్షల 50 వేల ఓట్లు పోలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన - బీజేపీ పొత్తు నేపథ్యంలో ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రఘు రామ బరిలో ఉండాలి. అలాగే ఆయనకు టిడిపి సపోర్ట్ కూడా ఉంటే ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిపై విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని సరికొత్త విశ్లేషణ వినపడుతోంది.
అంటే రఘురామకు అటు జనసేనతో పాటు ఇటు టిడిపి నుంచి కూడా సపోర్ట్ ఉంటే వైసీపీని సులువుగా ఓడించవచ్చు అని అంటున్నారు. వైసీపీ ఇక్కడ ఎలాగూ తిరిగి క్షత్రియ వర్గానికి చెందిన వ్యక్తికి ఎంపి టిక్కెట్ ఇవ్వనుంది. అయితే నర్సాపురం పార్లమెంటు పరిధిలో కాపు సామాజిక వర్గం ఓటర్ల డామినేషన్ ఎక్కువ. జనసేన ద్వారా ఆ వర్గం ఓట్లు రాబట్టుకోవడంతో పాటు... టిడిపి సపోర్ట్ ఉంటే బిసి ఓట్లు పోలరైజేషన్ చేయించుకోవటం ద్వారా రఘురామ సంచలన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈక్వేషన్ ఎంతవరకు ? సెట్ అవుతుందో చెప్పలేం..!