ఈటల రాజేందర్ గెలుపునకు దగ్గరగా ఉన్నాడనే అంచనాకు వచ్చేసిందా ఏమో తెలియదు గానీ. మాజీ మంత్రి బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ కొత్త టెక్నాలజీని వాడుతున్నారని టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు ఆ పార్టీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అలాగే మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, నాయకుడు రామచంద్రరావు ఫిర్యాదు చేశారు. వాళ్లు మాట్లాడుతూ కొత్త టెక్నాలజీ ద్వారా ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ.. చాలామంది పేర్లతో బ్యాంకు ఖాతాలు కూడా ఓపెన్ చేయించారని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.
ఆ అకౌంట్ల నుంచి ఓటర్లకు డబ్బులు పంచేందుకు సన్నాహలు జరుగతున్నాయంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్ని ఖాతాలు ఓపెన్ చేశారనేదానిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ఇక మరోవైపు బీజేపీ సోషల్ మీడియాను వాడుకోవడంలో పీహెచ్డీ చేసిందంటున్నారు. గతంలో దుబ్బాకలో ఫోన్పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపిణీ చేసినట్టే ఇక్కడ కూడా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం రావడంతో సీఈఓ కు ఫిర్యాదు చేశామంటోంది టీఆర్ఎస్. ఇక దళితబంధు అమలుతో హుజురాబాద్లో టీఆర్ఎస్ గెలుస్తుందనే భయంతోనే బీజేపీ కుట్రలకు పాల్పడుతుందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈటల గెలుపు భయంతోనే టీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ చేస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.