హైదరాబాద్ లో భారీ వరదలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వరదల దెబ్బకు అందరూ కూడా అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఈ వరదల్లో  ప్రజలకు సహాయం చేయడానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ  ముందుకు వెళ్తున్నారు. ఇక హైదరాబాద్ వరదలపై టీడీపీ అధినేత చంద్రాబు నాయుడు స్పందించారు. ట్విట్టర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ట్వీట్ చేసారు.

ఈ జలప్రళయం ముగిసే వరకు హైదరాబాదు వాసులందరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని కోరుతున్నాను అని ఆయన సూచించారు.  మీరు జాగ్రత్తగా వుంటూ, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండని ఆయన సూచించారు. మీ భద్రత కోసం ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు. అవసరమైన చోట సహాయ సహకారాలను అందించాలి అని టిడిపి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిస్తున్నాను అని చంద్రబాబు తన ట్విట్టర్ లో సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: