కర్నూలులో నందికొట్కూరు నియోజకవర్గం సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరగగా కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైసీపీ నాయకులే నాపై కేసులు పెట్టాలని చూశారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మంత్రి అనిల్ కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ సహాయం చేశారు అన్నారు.

సొంత మండలంలో రెవెన్యూ అధికారులు ఇళ్ళ పట్టాలు ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  దగ్గరకు వెళ్లి చెప్పానని... వెంటనే ఆయన ఇళ్ళ పట్టాలు ఇప్పించాడన్నారు. నాకు ఎవరూ పోటీ లేరు నాకు నేనే పోటీ అన్నారు. ఎన్ని శక్తులు వచ్చినా నన్నేమి చేయలేవు అని ధీమా వ్యక్తం చేసారు. ప్రాణాలు ఇచ్చే రోజులు తీసేసే రోజులు పోయాయని... కాలాణుగునంగా అప్ డేట్ కాపోతే నారా లోకేష్, రాహుల్ గాంధీ లా ఉండాల్సి వస్తుందని మంచి మాట చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: