మలేరియా జ్వరం ఎక్కువగా ఉన్నట్లయితే ఐదు తులసి ఆకులు అలాగే ఐదు మిరియాలను ప్రతిరోజు తింటున్నట్లు అయితే మూడు రోజుల్లోనే మలేరియా జ్వరం తగ్గుముఖం పడుతుంది.
మలేరియా జ్వరం ప్రతి సంవత్సరం వచ్చి పీడిస్తున్నట్లయితే కొన్ని తులసి ఆకులను , మిరియాలను వేడి నీటిలో ఉడికించి అందులో కొద్దిగా బెల్లం, నిమ్మరసం కలిపి తాగినా కూడా మలేరియా జ్వరం నుంచి తప్పించుకోవచ్చు.
అంతేకాదు తులసి మొక్క యొక్క వేళ్ళను కషాయంగా చేసి మలేరియా జ్వరం వచ్చిన వారిచేత తాగించడం వల్ల శరీరంలో చెమటలు పట్టి త్వరగా జ్వరం తగ్గుతుంది.
ప్రతిసారి మలేరియా జ్వరం వస్తున్నప్పుడు అల్లం రసం, పుదీనా రసం, తులసి ఆకుల రసం 5 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల మలేరియా వంటి ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
అంతే కాదు ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటూ , ప్రతిరోజు కావలసినన్ని గోరువెచ్చని నీటిని సేవిస్తూ ఉండాలి. ఈ పద్ధతులు పాటిస్తే మలేరియా జ్వరం ఇట్టే పరార్ అవుతుంది.