బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండేపై ఆమె భర్త తాజాగా విచక్షణారహితంగా దాడి చేశాడు. భర్త తనపై దాడి చేశాడని నటి ఫిర్యాదు చేయడంతో ఆమె భర్త సామ్ బాంబేను తాజాగా ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ నేషనల్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత నటి ఆసుపత్రిలో చేరింది. ఆమె తల, కళ్లు, ముఖంపై గాయాలయ్యాయి. ఈ మేరకు పూనమ్ భర్త సామ్ పై భారత శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ల కింద సామ్ బాంబేపై కేసు నమోదు చేశారు. అలాగే పూనమ్ తల, కళ్ళు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి అని ముంబై పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ అంశంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
 
పూనమ్ పై భర్త దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం వారి వివాహమైన కొద్ది రోజులకే సామ్ గోవాలో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. తన భర్త తనను వేధించాడని, తనపై కేసు వేస్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడని పాండే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దక్షిణ గోవాలోని కనకోనా గ్రామంలో ఈ జంట సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతున్నట్లు సమయంలో ఈ ఘటన జరిగింది. అప్పట్లో సామ్ బాంబేపై భారత శిక్షాస్మృతిలోని 353 (బాధ కలిగించడం), 353 (అవమానం) 506 (నేరపూరిత బెదిరింపు) మరియు 354 (నిరాడంబరత) కింద కేసు నమోదు చేశారు.

అతనిపై నటి గోవాలో గృహ హింస కేసు నమోదు చేసింది. వెంటనే పూనమ్ సామ్‌తో రాజీపడి ఏ వివాహ బంధంలో అయినా  హెచ్చు తగ్గులు ఉండవు. గొడవలు సర్దుకుపోవడం మామూలు విషయమేనని చెప్పింది. సెప్టెంబర్ 1న బాంద్రాలో వీరి పెళ్లి వేడుక జరిగింది. అథ తక్కువ మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు ఈ జంట. అలాగే పెళ్ళికి ముందు పూనమ్, సామ్ దాదాపు రెండు సంవత్సరాలు కలిసి జీవించారు. ఆ తరువాతే పెళ్ళికి సిద్ధపడ్డారు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: