నందమూరి బాలకృష్ణ, మాస్ కా బాప్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం 'అఖండ' మూవీ సక్సెస్ మీట్ నిన్న రాత్రి వైజాగ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డితో పాటు సినిమాలో కీలక పాత్ర పోషించిన శ్రీకాంత్, పూర్ణ కూడా హాజరయ్యారు. వీరితో పాటు చిత్రం బృందం మొత్తం నిన్న రాత్రి జరిగిన 'అఖండ' విజయోత్సవ జాతర లో పాల్గొంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అఖండ జాతర మరికొన్ని రోజులు జరగాలని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీనులపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా దర్శకుడికి మాస్ కా బాప్ అంటూ ట్యాగ్లైన్ కూడా ఇచ్చేసాడు. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన శ్రీకాంత్ మాట్లాడుతూ తనకు ఇలాంటి అద్భుతమైన పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు బోయపాటికి కృతజ్ఞతలు తెలియజేశారు.
 
ఇక దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ సినిమాకు సినీ ప్రియుల నుంచి అద్భుతమైన స్పందన రావడం ఈ వేడుకను జరుపుకోవడానికి కారణం అని వెల్లడించారు. ఇక మూవీ లవర్స్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రోత్సహిస్తారని మరోసారి నిరూపించారని అన్నారు. సినిమా కమర్షియల్ హిట్ కావడమే అందుకు నిదర్శనమని, డిడ్ ఇండస్ట్రీకి ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఆయన చేస్తే క్యారెక్టర్ లు రెచ్చి పోతూ ఉంటాయి అని, బాలయ్యతో కలిసి మూడు సినిమాలు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక ప్రకృతి పిల్లలు పరమాత్మని గౌరవిస్తే రాబోయే తరాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు.

 
బాలయ్య మాట్లాడుతూ ఈరోజు వర్షం పడుతుంది అన్నారు అని, కానీ ఈ కార్యక్రమానికి వరుణ దేవుడు కూడా సహకరించడం శుభపరిణామమని అన్నారు. బోయపాటి, తాను ఒకరినొకరు బాగా నమ్ముతామని, సాధారణంగా బోయపాటి పూర్తిగా కథలు చెప్పడు అని అన్నారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే విని ఆయనకు ఓకే చెప్పానని, నటీనటుల నుండి అద్భుతమైన టాలెంట్ ను బయటకు తీసుకురా సామర్థ్యం బోయపాటి సొంతమని బాలయ్య ప్రశంసల వర్షం కురిపించారు. బోయపాటితో కలిసి హ్యాట్రిక్ హిట్ కొట్టడం సంతోషంగా ఉందని బాలయ్య వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: