ఫిలిం ఇండస్ట్రీలో ఓ దర్శకుడికి హిట్ వచ్చిందంటే కచ్చితంగా హీరోలు, నిర్మాతలు వరుస అవకాశాలు ఇస్తుంటారు. అంతేకాదు హిట్టొచ్చిన రెండు నుంచి మూడు నెలల్లో  కచ్చితంగా ఆ దర్శకుడికి సినిమా ఆఫర్ వస్తుంది. అయితే కొందరి విషయంలో మాత్రం ఈ సంవత్సరం అది జరగలేదు. టాలీవుడ్ లో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్లు కొందరు ఈ ఏడాది ఖాళీగానే ఉన్నారు. ఇక ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు మన సమీక్షలో తెలుసుకుందాం... గత సంవత్సరం సంక్రాంతికి కి 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాతో బాక్సాఫీస్ ముందుకు వచ్చాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

కమర్షియల్గా కూడా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడి నుండి మరో సినిమా విడుదల కాలేదు. సరి లేరు తర్వాత ఎఫ్ 2 సినిమా కి సీక్వెల్ గా 'ఎఫ్ 3' చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇక 2020లో 'భీష్మ' సినిమాతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు మరో యువ దర్శకుడు వెంకీ కుడుముల. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అంతేకాదు నితిన్ కెరియర్ లో భారీ కలెక్షన్స్ ని రాబట్టింది.ఇక ఈ సినిమా తర్వాత వెంకీ కుడుముల మరో సినిమాని మొదలు పెట్టలేదు.

ఈ సంవత్సరం మొత్తం ఖాళీగానే ఉన్నాడు.ఇక ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాని ప్రకటించాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక 2019లో 'గీతా గోవిందం' అనే సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న పరశురాం తన తర్వాతి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రకటించాడు.ఆ సినిమానే 'సర్కారు వారి పాట'. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చి దాదాపు ఏడాదిన్నర పూర్తయింది. 2019 తర్వాత ఈ దర్శకుడి నుంచి మరో సినిమా విడుదల కాలేదు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది.ఇక ఇదే లిస్టులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా  అన్నాడు గత సంవత్సరం అల వైకుంఠపురం తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న త్రివిక్రమ్ ఈ సంవత్సరం మాత్రం ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు అటు వంశీ పైడిపల్లి కూడా మహర్షి తర్వాత ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: