లెజెండరీ హీరో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ బాబు ఆకస్మిక మరణం ప్రతి సినీ ప్రియుడి గుండెల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయన మరణవార్త విని సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు కూడా అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.రమేష్ బాబు గారి మృతికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలిపారు.ఘట్టమనేని రమేష్ బాబు తమ్ముడు సూపర్ స్టార్ మహేష్ నేటి అంత్యక్రియలకు అందుబాటులో లేని సన్నివేశం నెలకొంది. అయితే ఆయన కొద్ది సేపటి క్రితం చాలా బాధతో గుండెల్ని టచ్ చేసే ఎమోషనల్ నోట్ తో అన్నయ్యకు కడసారి వీడ్కోలు పలికారు.రెండ్రోజుల ముందే మహేష్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. అందుకే ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. రమేష్ బాబు గారు చాలా కాలంగా ఆరోగ్యం బాగోలేక కాలేయ సంబంధిత సమస్యలతో బాధ పడుతూ మృతి చెందారు.

చెన్నైలో పుట్టిన రమేష్ బాబు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న సంగతి తెలిసినదే.తన సోషల్ మీడియా అన్ని అకౌంట్ లలో మహేష్ 90ల నాటి ఒక చిత్రాన్ని షేర్ చేస్తూ నోట రాసారు. అన్నయ్య నువ్వే నాకు ప్రేరణ.. నువ్వే నా బలం.. నువ్వు నా ధైర్యం.. నువ్వే నా సర్వస్వం. నువ్వు లేకుంటే ఈ రోజు ఉన్న దాంట్లో సగం అయినా నేను ఉండేవాడిని కాదు. మీరు నా కోసం చేసిన ప్రతిదానికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మీకు కేవలం విశ్రాంతి...విశ్రాంతి..మీకంటే నాకేది ఎక్కువ కాదు. ఇంకో జన్మంటూ ఉంటే మీరు ఎల్లప్పుడూ నా `అన్నయ్యగా వుండాలనుకుంటున్నాను. ఎప్పటికీ .. ఎప్పటికీ .. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను అన్నయ్య`` అని నోట్ లో మహేష్ ఎప్పుడు లేని విధంగా చాలా ఎమోషనల్ అయ్యారు.

ఇక కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం 11 గంటల నుంచి రమేశ్ బాబు భౌతికకాయాన్ని పద్మాలయా స్టూడియోలో ఉంచారు. అక్కడ ఇండస్ట్రీ జనం ఆయనకు అంతిమ నివాళులర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు అనేవి జరిగాయి. కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని కుటుంబ సభ్యులు తమ శ్రేయోభిలాషులు భద్రతా ప్రోటోకాల్ లను పాటించాలని దహన సంస్కారాల స్థలంలో గుమిగూడకుండా ఉండాలని కోరారు.ఇక ఇప్పటికి కూడా మహేష్ చాలా బాధలో వున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: