ఏదేమైనా పుష్ప సినిమా బన్నీ రేంజ్ ను అమాంతం పెంచేసింది అనే చెప్పాలి. మొదట్లో నెగెటివ్ టాక్ వచ్చినా కూడా అనూహ్యమైన రీతిలో అల్లు అర్జున్ పుష్ప సినిమాకు ఇంతటి స్థాయికి క్రేజ్ వచ్చిందంటే దానికి కారణం బాలీవుడ్ అని చెప్పాలి. టాలీవుడ్ లో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఒక్కసారిగా బన్నీ అభిమానులు తీవ్రమైన కలత చెందారు. ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో కష్టపడి తీసిన సినిమా ఫ్లాప్ అవుతుందేమోనన్న భయం వారిలో కనబడింది. కానీ బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా అర్థం చేసుకోవడానికి ఈ వారం రోజులు పట్టిన నేపథ్యంలో వారం తర్వాత ఈ సినిమాకు మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ రావడం మొదలైంది.

అలా బాలీవుడ్ ప్రేక్షకుల సపోర్ట్ తో ఈ చిత్రం ఘన విజయం సాధించి దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. అల్లు అర్జున్ నటనకు సుకుమార్ దర్శకత్వంలో బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోవడంతో తీసిన ఇంతటి స్థాయి విజయం సాధించడానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపింది చిత్రబృందం. ఏదేమైనా అల్లుఅర్జున్ ఆల్మోస్ట్ కింద కు పడిపోయే స్థాయి నుంచి ఆకాశానికి ఎదిగాడని అని చెప్పవచ్చు. అలా ఆయన పాన్ ఇండియా ఆరంగేట్రం ఎన్నో ట్విస్టులతో ముడిపడి ఇప్పుడు కథ సుఖాంతం అయ్యింది.

ఈ నేపథ్యంలో ప్రభాస్ సరసన అల్లు అర్జున్ రెండవ పాన్ ఇండియా స్టార్ గా నిలబడి పోయాడు. దాంతో తదుపరి ఇండియా హీరోల పరిస్థితి ఏవిధంగా ఉండబోతుందో అన్న అనుమానాలు సినీ పెద్దలు వ్యక్తపరుస్తున్నారు. విజయ్ దేవరకొండ రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేసి విడుదలకు రెడీగా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరు ఎంతటి స్థాయి లో హిట్ కొట్టి ఈ లిస్ట్ లో చేయనున్నారు అనేది ఇప్పుడు ఆసక్తి కరమైన విషయంగా మారింది. లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మార్కెట్లోకి ప్రవేశించే పోతుండగా ఆర్ ఆర్ ఆర్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: