అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ దర్శకుడిగా మారాడు సందీప్ వంగ. ప్రస్తుతం ఈయన బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో 'యానిమల్' సినిమాను చేస్తున్నాడు.అయితే ఒక్క సినిమానే రెండుసార్లు తీసి నేషనల్ డైరెక్టర్ రేంజ్ గుర్తింపు తెచ్చుకోవడం ఒక్క సందీప్ రెడ్డికే సాధ్యం అయింది . ప్రస్తుతం తన కొత్త సినిమాని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ‏తో చేయనున్నాడు. అయితే పరిణీతి చోప్రా ఈ సినిమాలో కథానాయికగా నటించనుంది.ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను దర్శకుడు ప్లాన్ చేశాడట.

 ఇక దీని కోసం పూజా హెగ్డే తీసుకున్నట్లుగా సమాచారం.ఇక ఆమె.. 'యానిమల్' కోసం అంగీకరిస్తుందో? లేదో? చూడాలి మరి.  ఇక ఈ విషయంలో ఆమె సమంతను ఫాలో అవుతున్నట్లు గా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అయితే ఈ సినిమాలో రణబీర్‌తో పాటు అనిల్ కపూర్ కూడా నటిస్తున్నాడు.  అంతేకాకుండా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో యంగ్ బ్యూటీ కూడా నటించబోతుంది అనే సమాచారం.అయితే ఆ బాలీవుడ్ యంగ్ బ్యూటీ అంటే.. 'త్రిప్తీ డిమ్రీ'.ఆమె ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతుంది.

అయితే పేరు కూడా డిఫరెంట్ గా ఉంది అంతేకాకుండా సీనియర్ నటుడు బాబీ డియోల్ కూడా ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు.అయితే వీరి కాంబినేషన్‏లో రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మునుపెన్నడూ రాని సరికొత్త కాన్సెప్టుతో ఈ సినిమాని తీస్తున్నారని బాలీవుడ్ మీడియాలో బాగా టాక్ నడుస్తోంది. సందీప్ వంగా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా కూడా హిట్ అయితే ఇక సందీప్ రేంజ్ మాములుగా ఉండదు. అంతేకాకుండా బోల్డ్ కంటెంట్ కు నాంది పలికిన 'అర్జున్ రెడ్డి'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ నుండి హిట్ సినిమా రావాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: