మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినమా మిశ్రమ ఫలితం అందుకోవడంతో మెగా అభిమానులు ఈ సినిమా యొక్క ఫలితం పై తీవ్రమైన నిరాశలో ఉన్నారు. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించగా ఈ చిత్రం తప్పకుండా మెగా అభిమానులకు ట్రీట్ అవుతుంది అని అందరూ భావించారు. కానీ ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది అని చెప్పాలి. కారణం ఏదైనా కూడా మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చేసిన ఈ సినిమా ఈ విధంగా అయిపోవడం పట్ల కొంత ఆగ్రహంగా ఉన్నారు.

అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం ఏమో కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన కొన్ని వివాదాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ విషయంలో కొరటాల శివ మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నాడనే విషయం బయటకు వస్తుంది. సంగీతం విషయంలో కూడా ఆయనకు మణి శర్మ కు మధ్య గొడవ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిప్పులేనిదే పొగ రాదు కాబట్టి ఈ రకమైన వార్త ప్రచారం అవ్వడం లో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది అని కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు.


నార్మల్ గా కొరటాల శివ దేవి శ్రీ ప్రసాద్ నే తన సినిమాలకు సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకుంటూ ఉంటాడు. మెగాస్టార్ రికమెండేశన్ మీద వచ్చిన మణిశర్మ దర్శకుడు ను తన సంగీతం తో మెప్పించలేదు అన్న విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. అంతే కాదు ఈ సినిమా యొక్క పాటలు నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రంగా ఉండడంతో ఈ విషయంలో కొరటాల శివ కరెక్ట్ అని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించిన వివాదాలు ఏమైనా భవిష్యత్తులో బయటపడతాయా అనేది చూడాలి. ఇంత పెద్ద సినిమాకు సంగీతం వహించే విషయంలో మణిశర్మ ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది అని ఆయన అభిమానులు సైతం చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: