త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ
సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అతడు ఖలేజా వంటి భారీ సూపర్ హిట్ సినిమాల తర్వాత వీరి కలయికలో
సినిమా రావడానికి చాలా సమయం పట్టింది. మధ్యలో ప్రయత్నించినా కూడా
సినిమా వీలు కాలేదు. ఈ నేపథ్యంలో ఈసారి హ్యాట్రిక్ విషయం అందుకోవాలని చెప్పి
త్రివిక్రమ్ మహేష్ ను అద్భుతమైన కథతో లాక్ చేశాడట. అలా ఇటీవలే సర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు భారీ సక్సెస్ను అందుకోవడానికి సిద్ధం అవుతున్నారు.
తాజాగా వచ్చిన సర్కారు వారి పాట
సినిమా మంచి వసూళ్లను రాబడుతుంది.
పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ
సినిమా హిట్
మూవీ అనే టాక్ తెచ్చుకోగా కొంతమంది ఈ సినిమాకు నెగిటివ్ టాక్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు వచ్చిన వసూళ్ళ ను చూస్తుంటే ఈ
సినిమా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మహేష్ బాబు
సినిమా పై అందరిలో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు తదుపరి
సినిమా తెరకెక్కుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన సినిమాలు థియేటర్లలో పెద్దగా విజయం సాధించలేక పోయినా కూడా బుల్లితెరపై బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
ఇప్పటికీ అతడు
సినిమా వస్తే భారీ గా రేటింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ విధంగా ఈ
సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇకపోతే మే 31 వ తేదీన
సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ను ఇవ్వబోతున్నారు. చిత్రబృందం ఆ రోజున ఈ
సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. పార్ధు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే
పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ
సినిమా జూన్ లో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.