విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి 2019 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఎఫ్ 2 మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా తాజాగా ఎఫ్ 3 మూవీ ని తెరకెక్కించారు. 

ఈ సీక్వెల్ మూవీ లో కూడా వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా నటించారు  ఇది ఇలా ఉంటే ఎఫ్ 2 సినిమా మంచి విజయం సాధించడంతో ఎఫ్ 3 మూవీ కి మంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అందులో భాగంగా ఎఫ్ 3 మూవీ కి నైజాం ఏరియాలో  దాదాపుగా 18 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. అయితే మొదటి వారం రోజుల పాటు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను సాధించిన ఎఫ్ 3  మూవీ ఆ తర్వాత వారం నుండి మేజర్ , విక్రమ్ సినిమాలో నుండి పోటీ ఎదురవడంతో ఎఫ్ 3 మూవీ కలెక్షన్లు చాలా వరకు తగ్గాయి.

ఇది ఇలా ఉంటే నైజాం ఏరియాలో 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న ఎఫ్ 3 సినిమా తాజాగా నైజాం ఏరియా నుండి 18 కోట్ల కాంటె ఎక్కువ షేర్ కలెక్షన్ లను సాధించి నైజాం ఏరియా లో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇప్పటి వరకు ఎఫ్ 3 మూవీ నైజాం ఏరియాలో 18.11 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. ప్రస్తుతం ఎఫ్ 3 మూవీ నైజాం ఏరియాలో లాభాలను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: