మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం భారతదేశం గర్వించ దగ్గ గొప్ప దర్శకులలో ఒకరైన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా ,  ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

రామ్ చరణ్ కి జోడిగా  ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  అంజలి , సునీల్మూవీ లో ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు .ఇది ఇలా ఉంటే వీరితో పాటు ఈ మూవీ లో దర్శకుడు మరియు నటుడు అయిన ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి  సంబంధించిన  కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక కథ తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ లో సీ ఎం కొడుకు పాత్రలో ఎస్ జే సూర్య కనిపించబోతున్నట్లు , సీ ఎం కొడుకుగా ఎస్ జే సూర్య అనేక అవినీతి పనులను చేస్తూ ఉండడంతో , నిజాయితీపరుడు అయినా ఐ ఏ ఎస్ ఆఫీసర్ రామ్ చరణ్ సీ ఎం కొడుకుని ఎలా బుద్ధి చెప్పాడు అనే దాని చుట్టే ఈ సినిమా కథ తిరుగుతుంది అని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.  

ఇది ఇలా ఉంటే శంకర్ తన క్రితం మూవీ లను తెరకెక్కించిన విధంగానే ఈ మూవీ ని కూడా అదిరిపోయే రేంజ్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: