ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు పూరి జగన్నాథ్ ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి లైగర్ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా నిన్నటి రోజున బ్రహ్మాండంగా విడుదలైంది. ఈ సినిమాకి మొదటినుంచే మిక్స్ డ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే ఎక్కువగా నెగటివ్ టాక్ వినిపిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథని విని రిజెక్ట్ చేసిన హీరోలు చాలామంది ఉన్నారు ఇప్పుడు వారి గురించే పలు విషయం ఆసక్తికరంగా మారుతోంది. వాటి గురించి చూద్దాం.


అయితే ఈ చిత్రాన్ని ముగ్గురు పాన్ ఇండియా హీరోలు కథ వినీ రియాక్ట్ చేశారు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం ఇందులో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ,అల్లు అర్జున్ ,ప్రభాస్ ఈ ముగ్గురు కూడా ఉన్నట్లు సమాచారం వీరు ముగ్గురు గతంలో పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు చేశారు. అల్లు అర్జున్ దేశముదురు, ఇద్దరమ్మాయిలతో వంట సినిమాలను చేశారు. ఇక ఆ బంధంతోనే లైగర్ సినిమా కథను చెప్పగా పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ తన బాడీ షేప్ నంతా మార్చారు మళ్లీ లైగర్ కోసం తన బాడీ షేప్ మార్చలేనని సున్నితానంగా తిరస్కరించారట.

ఇక ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే జరిగినట్లుగా సమాచారం వీరిద్దరూ కలిసి గతంలో టెంపర్ ఆంధ్రావాలా వంటి సినిమాలు చేశారు. rrr సినిమా షూటింగ్లో తన డేట్స్ అన్ని ఖాళీగా లేవని చెప్పడంతో ఈ సినిమా వేరే హీరోతో చేయమని చెప్పారట. ఇక తర్వాత ప్రభాస్ వద్దకు ఈ సినిమా కథ వెళ్లగా ప్రభాస్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో గతంలో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమా లు చేశారు. ప్రస్తుతం తన డేట్స్ ఖాళీగా లేవని ఇప్పట్లో సినిమా చేయడం కష్టమని చెప్పడంతో ఈ సినిమా విజయ్ దేవరకొండ వద్దకు వెళ్ళింది. డైరెక్టర్ మీద నమ్మకంతో విజయ్ సినిమాలో ఒప్పుకున్నా డు కానీ ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: