తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం 'తునివు' ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకుని విడుదలకు రెడీ అయ్యింది. ఇంకా ఈ సినిమాను తమిళ టాలెంటెడ్ దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అజిత్ ఫ్యాన్స్‌తో పాటు తమిళ ప్రేక్షకుల్లో కూడా ఎన్నో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వలిమై సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో, ఈ సినిమాతో కూడా వీరిద్దరు ఖచ్చితంగా మరో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగ బరిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించడంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేస్తోంది మూవీ యూనిట్. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.


 తునివు సినిమా ట్రైలర్‌ను ఈరోజు రాత్రి 7.30 గంటలకు మరి కొద్ది కాసేపట్లో తమిళనాడులోని పలు థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత బోనీ కపూర్ తెలిపారు. ట్రైలర్ ఒక రేంజిలో ఉంటుందని సమాచారం తెలుస్తుంది. ఖచ్చితంగా అభిమానులు ఎంజాయ్ చెయ్యడం ఖాయమట..భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ చిత్రం రాబోతుండగా, అజిత్ కుమార్ చేసే రియల్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను కట్టిపడేయనున్నట్లు మూవీ యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.ఇక ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ మంజు వారియర్ హీరోయిన్‌గా నటిస్తోండగా,టాలెంటెడ్ నటుడు సముథ్రకని మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకి గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, తెలుగులో ఈ సినిమాను 'తెగింపు' అనే టైటిల్‌తో విడుదల చేయనుంది మూవీ యూనిట్.కోలీవుడ్ మరో స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 'వారిసు' సినిమాతో పోటీకి దిగుతున్న అజిత్ 'తునివు' సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద భారీ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: