చాలాకాలం తర్వాత సమంత సోషల్ మీడియా లో మళ్లీ యాక్టివ్ గా కనిపిస్తోంది. టాలీవుడ్ లో సమంత చివరిగా యశోద సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఇక ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ షూటింగులకు బ్రేక్ ఇచ్చింది సమంత. అయితే గతంలో సమంత ఆరోగ్యం పైన కూడా పలు రకాలుగా వార్తలు వినిపించాయి. మయోసైటీస్ నుంచి కోలుకున్న సమంత శనివారం ముంబై ఎయిర్పోర్టులో కనిపించిందని పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా డబ్బింగ్ పనులలో సమంత ప్రస్తుతం పాల్గొంటుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే సమంత తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక ఫోటో వైరల్ గా మారుతు కనిపిస్తోంది... శాకుంతలం సినిమాలోని భంగీమను అనుసరిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. శాకుంతలం సినిమా భంగిమను ఎలా ఉన్నా సరే కొనసాగించాలంటే చెప్పుకొస్తోంది సమంత.

శాకుంతలం సినిమా కష్టమైన అంశం ఏమిటంటే.. నడుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు కూడా దయ భంగిమను కొనసాగించడం.. దయ అనేది నా విషయం కాదు అందుకు సాషాను కూడా వెంట తీసుకెళ్లాల్సి ఉండాల్సింది అంటూ శాకుంతల భంగిమను షేర్ చేసింది సమంత. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.సాషాకు సంబంధించిన విషయాలు మాత్రమే సంబంధాలు నవ్వించగలవు మీకు మీరుగా పోరాడడం గొప్ప విషయం మేడం అంటూ పలు రకాలుగా కామెట్టు చేస్తున్నారు అభిమానులు. ఇక శాకుంతలం సినిమా అయిపోయిన వెంటనే విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి చిత్రంలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలను నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: