విరూపాక్ష సినిమా తో మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాయి ధరం తేజ్ తన తరువాత సినిమా గురించి క్రేజీ అప్డేట్ ను అయితే ఇచ్చారు.

ఆల్రెడీ సెట్స్ మీద పవన్ తో వినోదయ సీతం ఉండగా తన తర్వాత సినిమా డైరెక్టర్ ని ఫిక్స్ చేసుకున్నాడనీ తెలుస్తుంది.ఇంతకీ సాయి ధరం తేజ్ తరువాత చేస్తున్న సినిమా డైరెక్టర్ ఎవరంటే చరణ్ తో రచ్చ సినిమా చేసిన సంపత్ నందితో అని తెలుస్తుంది. ఏమైంది ఈవేళ సినిమా తో హిట్ అందుకుని రామ్ చరణ్ తో రచ్చ సినిమా చేసిన సంపత్ నంది ఆ తర్వాత ఎందుకో కానీ అంతగా క్లిక్ అవలేకపోయాడు.

రవితేజ తో బెంగాల్ టైగర్ అలాగే గోపీచంద్ తో గౌతం నందా, సీటీమార్ వంటి సినిమాలు చేసిన  కూడా సంపత్ నంది మధ్య లో నిర్మాత గా కూడా ప్రయత్నాలు కొన్ని చేశారు. ఫైనల్ గా సాయి ధరం తేజ్ తో సినిమా ఫైనల్ అయినట్టు సమాచారం. సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తారని సమాచారం.. ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ అయితే త్వరలో రానుంది. సంపత్ నంది సాయి ధరం తేజ్ క్రేజీ కాంబో మెగా ఫ్యాన్స్ కి మంచి మాస్ మసాలా సినిమా ఇస్తారని తెలుస్తుంది.విరూపాక్ష  తర్వాత పవన్ సినిమా జూలై 28న విడుదలకు ప్లాన్ చేయగా ఆ సినిమా తర్వాత సంపత్ నంది సినిమా సెట్స్ మీద కు వెళ్తుందని టాక్ అయితే నడుస్తుంది.విరూపాక్ష సినిమాతో మంచి హిట్ కొట్టాలని సాయి ధరమ్ తేజ్ చూస్తున్నాడు. ఈ మధ్య తను చేసిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోతున్నాయి. ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని ఉన్నాడట సాయి ధరమ్ తేజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: