తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన యువ హీరో లలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ ఆఖరుగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.  ఇలా టైగర్ మూవీ పరాజయం తర్వాత విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నర్వణ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ఖుషి మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

 ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత విజయ్ తన తదుపరి మూవీ ని పరుశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ.కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొన్ని రోజుల క్రితమే వెలవడింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ ముహూర్తం కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ ... పరుశురామ్ కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ ముహూర్తం మే మొదటి వారంలో ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే విజయ్ ... పరుశురామ్ కాంబినేషన్ లో గీత గోవిందం మూవీ రూపొంది భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో వీరి కాంబినేషన్ లో రూపొందబోయే తదుపరి మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే పరుశురామ్ ఆఖరుగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన సర్కారు వారి పాట మూవీ కి దర్శకత్వం వహించి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: